మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో, జిల్లాలోని 3674 కేంద్రాలకు గాను మూడు దశల్లో 999 సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. మొదటి దశ నామినేషన్ల స్క్రూటినీ పూర్తయిందని ఆమె పేర్కొన్నారు.