దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో బుధవారం బొడ్రాయి, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, పండుగలను మతసామరస్యంతో కలిసికట్టుగా జరుపుకోవడం అభినందనీయమని గ్రామస్థులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.