రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి గాయాలైన ఘటన గురువారం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం జాతీయ రహదారి- 167 రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తికి తలకు, ఎడమ చేతికి బలమైన గాయాలతో పడి ఉన్నాడు. అతడు మాట్లాడలేని స్థితిలో ఉండడంతో చికిత్స కోసం 108 అంబులెన్స్ లో మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిని ఎవరైనా గుర్తు పడితే ఎస్ఐ నాగన్నను సంప్రదించాలన్నారు.