ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. వనపర్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహమ్మద్ మునవర్ అలీని నియమించారు. కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ శంకర్కు పోస్టింగ్ ఇచ్చారు. వడ్డేపల్లి కమిషనర్ రాజయ్యను మక్తలుకు, ఐజ మున్సిపాలిటీ మేనేజర్ అశోక్ రెడ్డిని వడ్డేపల్లి కమిషనర్ గా నియమించారు.