మహబూబ్ నగర్ జిల్లాలో సోషల్ మీడియా ద్వారా వర్గాల మధ్య అపోహలు లేదా ఉద్రిక్తతలు కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డి. జానకి మంగళవారం తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, నిర్ధారించని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయవద్దని ఆమె సూచించారు.