స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మూడవ విడత నామినేషన్ల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడ్డాకల్, మూసాపేట, బాలనగర్, జడ్చర్ల, భూత్ పూర్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, 133 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.