మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై, వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంకటేష్, మిర్యాల వేణుగోపాల్, ఎదిర ప్రమోద్ కుమార్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.