మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన దిశ సమావేశంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు నిష్పక్షపాతంగా అందేలా అధికారులు చూడాలని ఆమె సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలను పరిశీలించిన తర్వాతే పథకాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.