గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయలేదని,
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిన్నచింతకుంటలో జూనియర్ కాలేజ్, దేవరకద్రలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. రాబోయే విద్యా సంవత్సరం నాటికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం పూర్తి చేసి, దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.