జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్ మండల కేంద్రంలో సోమవారం సెంటర్ బ్యాంక్ సమీపంలో ఓ బైక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. మంటలను గమనించిన వెంటనే వాహనదారుడు అప్రమత్తమై బైక్ను నిలిపివేశారు. సమీపంలో నీళ్లు అందుబాటులో ఉండటంతో స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.