జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. అయితే, ఈ పదవి కోసం గ్రామపెద్దలు బహిరంగ వేలంపాట నిర్వహించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రామంలోని వారే వేలంలో పాల్గొనాలని షరతు విధించడంతో, స్థానికులు పోటీపడి రూ.38 లక్షల వరకు పాడి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.