రైతులు ఎదుర్కొంటున్న పత్తి విత్తనాల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కంపెనీలపై నియంత్రణతో పాటు రైతుల హక్కులను బలపరిచే కొత్త విత్తన చట్టం త్వరలో అమలులోకి రానుందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బి. యం సంతోష్ అధ్యక్షతన విత్తన పత్తిపంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు.