జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై డ్రైవర్ ప్రసాద్ స్పందించారు. అనంతపురం నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు ముందు అతి వేగంగా వచ్చిన కారు అడ్డు రావడంతో, దానిని తప్పించే ప్రయత్నంలో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడిందని ఆయన తెలిపారు. వెంటనే ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు పంపించినట్టు వివరించారు.