గురువారం జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ కిందపడి ద్విచక్ర వాహనదారుడు చింతలన్న మృతి చెందారు. మృతుడు ధరూర్ మండలం ఆల్వాలపాడు పరిధిలోని మైలగడ్డ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.