
జడ్చర్ల: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ. డీ. జానకి
మంగళవారం రాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో, బుధవారం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు మరియు సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్సై లెనిన్, స్పెషల్ బ్రాంచ్ అధికారి గోపాల్ రెడ్డి, మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



































