మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ కు చెందిన జాజిమొగ్గల సురేశ్ (28) మార్చి 2న ఒక వ్యక్తిని అడ్డగించి, అతని మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఈ కేసులో పోలీసులు మంగళవారం హైదరాబాదులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడి నుండి బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, రిమాండుకు తరలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.