మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం అమ్మపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో అలంకార దర్శనాలను నవంబర్ 17 వరకు పొడిగించారు. పాలకమండలి ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈఓ మదనేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. నవంబర్ 17 ఉదయం 10 గంటలకు అలంకారం తొలగిస్తారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది.