మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో డిఎస్పి వెంకటేశ్వర్లు ఈ వివరాలు వెల్లడించారు. నిందితులు ఆన్లైన్ గేమింగ్ కు బానిసై భారీగా అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చడానికి దొంగతనాలు చేసినట్లు తెలిపారు. సీఐ కమలాకర్, ఎస్ఐ మల్లేష్ బృందం ఈ అరెస్ట్ లో కీలక పాత్ర పోషించింది.