శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలో రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన గూని యాదయ్య తన భార్యతో గొడవపడి క్షణికావేశంలో రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహబూబ్ నగర్ స్టేషన్ మాస్టర్ ప్రశాంత్ కుమార్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.