మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలోని మన్సూర్ దాబా వద్ద బుధవారం అర్ధరాత్రి రెండు ట్రావెల్ బస్సులు ఓవర్టేక్ చేస్తూ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో తిరుపతికి చెందిన అశోక్ రెడ్డి మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న DCRB డిఎస్పి రమణ, రూరల్ సీఐ మహేశ్ గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.