మహబూబ్‌నగర్: అక్షయపాత్ర సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే

3చూసినవారు
మహబూబ్‌నగర్: అక్షయపాత్ర సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం హన్వాడ మండలంలోని వేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఆకలితో చదువుకు దూరం కాకుండా పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించడమే ఈ సంస్థ లక్ష్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఆకలితో ఏ విద్యార్థి చదువు ఆగకుండా అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవ అభినందనీయమని అన్నారు. ఆయన స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు.

సంబంధిత పోస్ట్