మహబూబ్ నగర్ జిల్లాలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ, రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత కాదని, ప్రతి పౌరుడు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, సీఐలు శ్రీనివాస్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.