మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మిడ్జిల్ మండలంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహించిన యూపీ రాజుకు డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి లభించింది. దీంతో, దేవరకద్రలో డీటీగా పనిచేస్తున్న స్వప్నను ప్రభుత్వం నూతన మిడ్జిల్ తహశీల్దార్ గా నియమించింది. శనివారం ఆమె అధికారికంగా నూతన ఎమ్మార్వో బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం వల్ల మండల ప్రజలకు కుల, ఆదాయ సర్టిఫికెట్ల జారీలో జాప్యం తగ్గుతుందని భావిస్తున్నారు.