జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న చోటనే ఈ పరిస్థితి ఉంటే, ఇతర జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనతో వైద్య ఆరోగ్య శాఖపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని ఎంపీ అరుణ అన్నారు.