
మహబూబ్ నగర్: ఊళ్లకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.!: ఎస్పి
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి ఆదివారం ప్రజలకు కీలక సూచనలు చేశారు. సంక్రాంతి సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని ఆమె కోరారు. విలువైన నగలు, నగదును బీరువాల్లో ఉంచకుండా జాగ్రత్త పడాలని, నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.







































