మక్తల్: రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని వినతి

65చూసినవారు
మక్తల్: రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని వినతి
మక్తల్ ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులు నారాయణపేట కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతి పత్రం అందించారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి సానుకూలంగా సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు. బీజీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్