
నాగర్ కర్నూల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ 8వ వార్డులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆదివారం నాడు బీఆర్ఎస్ అభ్యర్థి బాబు రావుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి, వార్డు అభివృద్ధి కోసం కారు గుర్తుకే ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు. తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.







































