నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మల్లంకుంటలో బుధవారం సాయంత్రం మురికి కాలువలో ఓ నవజాత శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును కాలువలో పడేశారని అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.