నాగర్ కర్నూల్లో మంగళవారం పరీక్ష రాసిన 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్కి వెళ్లగా, అక్కడి బాత్రూంలో మగబిడ్డకు ప్రసవించింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు, తల్లితో కలిసి పసికందుని చెత్తబుట్టలో పడేసింది. అయితే, సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.