నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలోని జిన్నింగ్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం మొక్కజొన్న ధాన్యంతో వచ్చిన వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి నిలబడ్డాయి. మొక్కజొన్న విక్రయించడానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.