కల్వకుర్తి: పంట నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం: కసిరెడ్డి

3చూసినవారు
మొంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. గురువారం కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో తెగిన ఎర్రకుంటను పరిశీలించిన ఆయన, రైతులు, అధికారులతో మాట్లాడి నష్ట వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షాల వల్ల పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :