నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించి, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలని సూచించారు. జిల్లాలోని 10 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికల కోసం 9 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 12న స్క్రూటినీ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సన్నద్ధతపై ఆయన సమీక్ష నిర్వహించారు.