డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎక్సైజ్ అకాడమీలో గ్రూప్-1, గ్రూప్-2 ద్వారా ఎంపికైన ఏఈఎస్, ఎస్ఐలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఈ సారి వారికి వెపన్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణలో ప్రతిభ కనబరచిన వారిని గుర్తించి యాక్సలరీ ప్రమోషన్లు అందజేస్తామని వెల్లడించారు.