గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరులో ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ డాక్టర్. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా అయ్యే అవకాశం ఉంటుందని, అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏవిధమైన రవాణా జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగించాలని ఆదేశించారు.