శుక్రవారం, నాగర్ కర్నూల్ జిల్లా రచయిత ముచ్చర్ల దినకర్ రాసిన 'మన ప్రజాపాలన' పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రచయిత దినకర్ తమ పుస్తకాన్ని సీఎంకు అంకితమిచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని అన్నారు.