మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షం కారణంగా మహబూబ్ నగర్ రహదారి జలమయమైంది. బస్సులు, ఆటోలు, కార్లు నీటిలో నిలిచిపోయాయి. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోకి వరద నీరు చేరడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షం ధాటికి జనజీవనం స్తంభించి, నాగర్ కర్నూల్ జలదిగ్బంధంలో చిక్కుకుంది.