నారాయణపేట జిల్లాలో శనివారం నుంచి నవంబర్ 30 వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా రాజకీయ, కార్మిక, విద్యార్థి, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు నిరసనలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టే వార్తలు వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.