
ఎబోలా ఎఫెక్ట్.. విజయవాడ ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ పరీక్షలు
AP: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి వైరస్ ప్రవేశించకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా మంగళవారం విజయవాడ ఎయిర్పోర్టులో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. కేంద్ర పౌర విమానయానశాఖ ఆదేశాల మేరకు విదేశీ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.




