ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో కనకదుర్గమ్మ
By k. satyaveni 16831చూసినవారుAP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా నవరాత్రి ఉత్సవాల ఆరవ రోజున అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పురాణాల ప్రకారం, జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్టసంహారం చేసి లోకాలను కాపాడారు. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు.