TG: విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో స్తంభాలు, లైన్స్ కోసం వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఒక్కో రీతిలో ఫీజు వసూలు చేసేవారు. ఇకపై ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు 1 కిలో వాట్ వరకు రూ.500. ఒకటి నుంచి 5కేవీ వరకు రూ.500+ కిలో వాట్కి రూ.600 చొప్పున వసూలు చేయనున్నారు. ఈ ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి.