భారత్లో సూర్యరశ్మి పుష్కలంగా ఉన్నప్పటికీ, 70-90% మంది ప్రజలు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారని ఐసీఎమ్ఆర్ అధ్యయనం వెల్లడించింది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఇది దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద పోషకాహార సమస్య. విటమిన్ డీ, శరీరం కాల్షియంను గ్రహించడానికి, రోగనిరోధక శక్తి, మెదడు ఆరోగ్యానికి కీలకం. సూర్యరశ్మిలోని యూవీబీ కిరణాల ద్వారా చర్మంలో ఇది తయారవుతుంది. లోపం వల్ల అలసట, కండరాల నొప్పులు, తరచుగా అనారోగ్యాలు వస్తాయి. రోజూ ఉదయం 15-20 నిమిషాలు ఎండలో నిలబడటం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.