AP: అన్నమయ్య జిల్లా, రాజంపేటలోని BSNL ఆఫీసు సమీపంలో గురువారం రాత్రి యేమిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి (39) అనే యువకుడు విషం తాగి, ఆపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు ముందు సెల్ఫీ వీడియోలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. మృతుడు నంద్యాల (D) చిన్నవంగలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయనకు రెండో వివాహం కాగా, భార్య పద్మినికి కూడా రెండో వివాహం.