AP: కడప శివారులోని వినాయక సర్కిల్ సమీపంలో ఓ వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 28వ తేదీన స్క్రాప్ దుకాణం బయట ఓ వ్యక్తి చెత్తకు మంట పెట్టారు. ఈ క్రమంలో పెట్రోల్ బాటిల్ పగిలింది. దాంతో మంటలు అంటుకుని ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స బుధవారం మృతి చెందాడు. మృతుడు మొఘల్ అలీమా బెగ్కు చెందిన నకాశ్గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.