మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్ ఓ లాడ్జిలో దారుణ హత్య జరిగింది. మేరీ, దిలావర్ సింగ్ ఇద్దరు ఆరు సంవత్సరాలుగా సంబంధంలో ఉన్నారు. మేరీకి మరొకరితో ప్రేమ వ్యవహారం ఉందనే అనుమానంతో, దిలావర్ సింగ్ ఆమె పుట్టినరోజు వేడుక జరిపిన వెంటనే, ఆమెపై కత్తి, బ్లేడుతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం, నిందితుడు కొండ్వా పోలీస్ స్టేషన్లో లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.