మాజీ ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతోందని.. ఓ మహిళను తన భర్త సుత్తితో కొట్టి చంపేశాడు. ఈ ఘటన యూపీలోని ఎటా నగరంలో చోటు చేసుకుంది. భర్త ప్రేమ్చంద్ గుప్తా, తన భార్య గౌతమి గుప్తా (39)ను తలపై సుత్తితో (హ్యామర్) కొట్టి చంపాడు. గౌతమి తన ప్రియుడితో వీడియో కాల్లో మాట్లాడటంతో, భర్త మొదట వద్దని చెప్పాడు. అయినా ఆమె వినకపోవడంతో, కోపంతో ప్రేమ్చంద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.