ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల్లో కేక్ ముఖానికి పూశారనే కోపంతో స్నేహితులపై కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.