మధ్యప్రదేశ్లోని శివపురిలో మహారాణా ప్రతాప్ కాలనీలో న్యాయవాది సంజీవ్ బిల్గయ్య కార్యాలయం బయట, ఖరీదైన డిజైర్ కారులో వచ్చిన ఒక వ్యక్తి వార్తాపత్రికను దొంగిలించాడు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. రూ.8 లక్షల కారులో వచ్చి కేవలం రూ.8 విలువైన వార్తాపత్రికను దొంగిలించడంపై న్యాయవాది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.