కేరళలో ఆర్టీసీ బస్సులో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బస్సులో మహిళ పక్కన కూర్చొని.. ఆమెను అనుచితంగా తాకాడు. దీంతో సదరు మహిళ అతనిపై చెంపదెబ్బలు, పిడిగుద్దులు కురిపించింది. వెంటనే కండక్టర్ అతనిపై సీరియస్ అయి పంపించాడు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.