శనివారం బెల్లంపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను ఏసీపీ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాసరావు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు, శుభ్రత, నీరు, విద్యుత్, ర్యాంపులు, టాయిలెట్ల సౌకర్యాలను దగ్గరుండి పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లపై కూడా పరిశీలన జరిపి, మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలు చేశారు.