సిఐటియు 5వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను సోమవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులతో కలిసి విడుదల చేశారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో మెదక్లో జరిగే రాష్ట్ర మహాసభలలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి చల్లూరి దేవదాస్ కోరారు. ఈ మహాసభలకు సిఐటియు అగ్ర నేతలు చుక్కా రాములు, రాఘవులు హాజరవుతారని పేర్కొన్నారు.